భారత్, బంగ్లాదేశ్ మధ్య ఇటీవల పెరిగిన ఉద్రిక్తతలు క్రీడారంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. క్రికెట్తో పాటు గోల్ఫ్పైనా ఈ ప్రభావం పడింది. బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై హింసాత్మక ఘటనలు పెరిగాయన్న నివేదికల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో, ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా లో బంగ్లాదేశ్ ఆటగాళ్ల భాగస్వామ్యంపై సందిగ్ధత నెలకొంది.ఈ విషయంపై పీజీటీఐ అధ్యక్షుడు, భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ స్పందించారు. పీజీటీఐలో బంగ్లాదేశ్ ఆటగాళ్ల ప్రాతినిధ్యంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. త్వరలో బోర్డు సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత ఈ విషయంపై చర్చించి అందరికీ తెలియజేస్తాం అని కపిల్ దేవ్ ఐఏఎన్ఎస్కు తెలిపారు. పీజీటీఐ టూర్లో బంగ్లాదేశ్కు చెందిన జమాల్ హొస్సేన్, సిద్ధికుర్ రెహమాన్ వంటి ప్రముఖ గోల్ఫర్లు ఆడుతున్న విషయం తెలిసిందే.ఇదిలా ఉండగా, క్రికెట్లో ఈ వివాదం మరింత ముదిరింది. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్కతా నైట్ రైడర్స్ నుంచి తప్పించాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. బీసీసీఐ నిర్ణయానికి సరైన కారణాలు చెప్పలేదని, ఇది తమ దేశ ప్రజలను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని బంగ్లాదేశ్ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.ఈ నిర్ణయానికి ప్రతిస్పందనగా, మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ మ్యాచ్ల ప్రసారాలను తమ దేశంలో నిలిపివేస్తున్నట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా, భద్రతా కారణాల దృష్ట్యా, ఫిబ్రవరిలో జరగనున్న టీ20 ప్రపంచకప్లో తమ మ్యాచ్లన్నింటినీ భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ని అభ్యర్థించింది. 2026 టీ20 ప్రపంచకప్కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa