ప్రజల పక్షాన నిలబడి పనిచేసే పార్టీగా వైయస్ఆర్సీపీకి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికీ అపారమైన ఆదరణ ఉందని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పష్టం చేశారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ, సంక్షేమం–అభివృద్ధే లక్ష్యంగా వైయస్ జగన్ నాయకత్వంలో పార్టీ ముందుకు సాగిందని గుర్తు చేశారు. నిడదవోలు నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో విస్తృత స్థాయి నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు గెడ్డం శ్రీనివాస నాయుడు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పు గోదావరి జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు శ్రీ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ హాజరై మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో పాటు, వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో వైయస్ఆర్సీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అలాగే రాజనగరం మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా సమావేశంలో పాల్గొని యువత రాజకీయాల్లో చురుకుగా పాల్గొనాల్సిన అవసరాన్ని వివరించారు. ప్రజా ఉద్యమాల ద్వారానే ప్రజాస్వామ్య విలువలు కాపాడబడతాయని, యువత పార్టీ బలోపేతంలో కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa