గత ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మోసపూరితంగా ఓడించారని, అయితే వచ్చే ఎన్నికల్లో వడ్డీతో సహా తిరిగి ఇచ్చేందుకు కార్యకర్తలు ఇప్పటి నుంచే సమయాత్తం కావాలని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. అనంతపురంలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ కూటమి నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. టీడీపీ–బీజేపీ–జనసేన కూటమి నేతలు “పులివెందుల ఎమ్మెల్యే”, “11 మంది ఎమ్మెల్యేలు” అంటూ వైయస్ జగన్ మోహన్ రెడ్డిని, వైయస్ఆర్ సీపీని కించపరిచే వ్యాఖ్యలు చేయడం వారి భయానికి నిదర్శనమని అన్నారు. “మరి అంత చిన్న పార్టీ అనుకుంటే… వైయస్ జగన్ మోహన్ రెడ్డిని చూసి టీడీపీ కూటమి పెద్దలు ఎందుకు భయపడుతున్నారు?” అని ప్రశ్నించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడే కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని, పార్టీ కోసం అహర్నిశలు పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన గౌరవం, గుర్తింపు తప్పకుండా లభిస్తుందని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రజల్లోకి వెళ్లి జగన్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని విస్తృతంగా చాటిచెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa