ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న డీజీపీ సస్పెండ్

national |  Suryaa Desk  | Published : Tue, Jan 20, 2026, 02:43 PM

అధికారిక కార్యాలయంలోనే పలువురు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐపీఎస్ అధికారి, డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ రైట్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీపీ డాక్టర్ కె. రామచంద్రరావును కర్ణాటక ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు సిబ్బంది, పరిపాలన సంస్కరణల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ప్రవర్తన ప్రభుత్వ ప్రతిష్ఠ‌కు భంగం కలిగించేలా ఉందని, ప్రభుత్వ ఉద్యోగికి తగనిదని ఉత్తర్వుల్లో పేర్కొంది.రామచంద్రరావు తన కార్యాలయంలో పలువురు మహిళలతో సన్నిహితంగా మెలుగుతున్న వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో, పలు న్యూస్ ఛానళ్లలో విస్తృతంగా ప్రసారమయ్యాయి. ఈ వీడియోల ఆధారంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. “ప్రభుత్వ ఉద్యోగిగా ఆయన ప్రవర్తన అఖిల భారత సర్వీసుల (ప్రవర్తనా) నిబంధనలు-1968లోని రూల్ 3ను ఉల్లంఘించడమేనని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చాం. అందుకే విచారణ పూర్తయ్యే వరకు ఆయన్ను తక్షణమే సస్పెన్షన్‌లో ఉంచుతున్నాం” అని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. సస్పెన్షన్ కాలంలో ఆయనకు నిబంధనల ప్రకారం జీవనభృతి చెల్లిస్తామని, ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa