2026 టీ20 ప్రపంచ కప్లో బంగ్లాదేశ్ పాల్గొనడంపై తీవ్ర అనిశ్చితి నెలకొంది. భారత్తో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో తమ జట్టును టోర్నీకి పంపేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) విముఖత చూపుతోంది. ఒకవేళ బంగ్లాదేశ్ ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకుంటే, వారి స్థానంలో స్కాట్లాండ్కు అవకాశం దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది.భారత్లో భద్రతాపరమైన ఆందోళనలు ఉన్నాయని పేర్కొంటూ బంగ్లాదేశ్ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముంబై, కోల్కతాలలో జరగాల్సిన తమ గ్రూప్ మ్యాచ్లను సహ-ఆతిథ్య దేశమైన శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది. అలాగే, శ్రీలంకలో ఆడనున్న ఐర్లాండ్తో గ్రూప్ మార్చుకోవాలని కూడా ప్రతిపాదించింది. అయితే, ఈ రెండు అభ్యర్థనలను ఐసీసీ తిరస్కరించినట్లు సమాచారం.టోర్నమెంట్ ప్రారంభానికి మూడు వారాల సమయం మాత్రమే ఉన్నప్పటికీ, బంగ్లాదేశ్ తన వైఖరిని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఒకవేళ వారు తప్పుకుంటే, నిబంధనల ప్రకారం తర్వాతి అత్యుత్తమ ర్యాంకులో ఉన్న స్కాట్లాండ్ జట్టుకు అవకాశం లభిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa