ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒంటరిగా గెలుపు కథ రాసిన సూపర్ స్టార్ – 35 బంతుల్లోనే 84 పరుగులు!

sports |  Suryaa Desk  | Published : Wed, Jan 21, 2026, 08:58 PM

టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. నాగ్‌పూర్ వేదికగా బుధవారం (జనవరి 21) విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది.ఇన్నింగ్స్ ఆరంభం నుంచే అభిషేక్ శర్మ కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఎప్పటిలాగే దూకుడైన ఆటతో బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 35 బంతుల్లోనే 84 పరుగులు సాధించి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 8 భారీ సిక్సులు ఉన్నాయి.ఈ మ్యాచ్‌లో భారత్ కేవలం 27 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు సంజు శాంసన్ (10), ఇషాన్ కిషాన్ (8) త్వరగానే పెవిలియన్ చేరారు. అయితే ఒక ఎండ్‌లో వరుసగా వికెట్లు పడుతున్నా అభిషేక్ మాత్రం తన దూకుడును తగ్గించలేదు. వరుస బౌండరీలతో స్టేడియాన్ని ఉర్రూతలూగించాడు.22 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసిన ఈ యువ ఓపెనర్, ఆ తర్వాత మరింత రెచ్చిపోయాడు. ఆపై ఎదుర్కొన్న 12 బంతుల్లోనే 35 పరుగులు రాబట్టాడు. 11వ ఓవర్లో ఫోర్, రెండు సిక్సులతో చెలరేగిన అభిషేక్, అదే ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. దీంతో అతడి అద్భుత ఇన్నింగ్స్‌కు తెరపడింది.మ్యాచ్ పరిస్థితిని చూస్తే.. ప్రస్తుతం భారత్ 14 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. క్రీజ్‌లో హార్దిక్ పాండ్య (12) ఉన్నాడు. అభిషేక్ శర్మ 85 పరుగులతో టీమిండియాకు అదిరిపోయే ఆరంభం అందించాడు. సూర్యకుమార్ యాదవ్ 32 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. కాగా సంజు శాంసన్, ఇషాన్ కిషన్ నిరాశపరిచారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa