సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు కేబినెట్ సమావేశం జరగనుంది. వెలగపూడిలోని సచివాలయంలో ఉదయం 10.30 గంటలకు మంత్రి వర్గ భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో తిరుమల లడ్డూ రాజకీయం, వైసీపీ నేతల దాడులు, అరెస్టుల అంశాలపై సమగ్ర చర్చ జరగనున్నట్లు సమాచారం. అలాగే అసెంబ్లీ సమావేశాలపై మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేయనున్నారు. సమావేశంలో రాష్ట్రాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, సంక్షేమ పథకాల అమలు, పరిపాలనకు సంబంధించిన పలు కీలక అంశాలపై విస్తృతంగా కేబినెట్ చర్చించనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులు, పెట్టుబడులు, పరిశ్రమలకు సంబంధించిన నిర్ణయాలతో పాటు మరికొన్ని కీలక అంశాలపై కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. గత కేబినెట్లో 30కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, వారం రోజుల్లోనే మరోసారి సమావేశం కావడంతో ఈసారి కూడా ఎజెండా 30కి పైగా అంశాలు ఉండొచ్చని అంచనా. కేబినెట్ సమావేశం ఎజెండా పూర్తయిన అనంతరం రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగే అవకాశముంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa