ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్యాస్ బుకింగ్‌కు ఈ-కేవైసీ తప్పనిసరి.. ఈ నెల 31 వరకే గడువు!

national |  Suryaa Desk  | Published : Sat, Mar 28, 2026, 10:45 AM

గృహవసరాల గ్యాస్ బుకింగ్​ సేవలను మరింత పటిష్ఠం చేసే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. ఇక నుంచి గ్యాస్​ బుక్​ చేయాలంటే ఈ-కేవైసీ చేయించుకోవడం తప్పనిసరి చేసింది. ఇందుకు ఈ నెల 31 వరకు గడువు విధించింది. అప్పటిలోగా వినియోగదారులు ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించింది. ఇది వరకే కేవైసీ పూర్తి చేసుకున్న వారు ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు. వినియోగదారులు మీ-సేవ, గ్యాస్​ ఏజెన్సీలను సంప్రదించి ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa