విజయవాడ(Vijayawada)లో ఉగ్ర లింకుల కేసు(Terror Links Case) సంచలనంగా కొనసాగుతోంది. ఈ కేసు ఇప్పుడు కీలక దశకు చేరింది.నిందితులు షరీఫ్, సొహైల్ బేగ్, దానిష్, అబ్దుల్ సలాం, సైదా బేగంలను మరింత లోతుగా విచారించడానికి కొత్తపేట పోలీసులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో, వారిని మరింత కాలం పోలీసు కస్టడీలో ఉంచాలని కోరుతూ న్యాయస్థానంలో వారం రోజుల కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు.ప్రస్తుతం ఐదుగురు నిందితులు రాజమండ్రి కేంద్ర కారాగారంలో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. పోలీసులు అంచనా ప్రకారం, వారి కార్యకలాపాలు దేశ భద్రతకు ముప్పు కలిగిస్తాయి. అలాగే, నెట్వర్క్ వెనుక ఉన్న అసలు సూత్రధారులను వెలికితీసే క్రమంలో పోలీస్ కస్టడీ అవసరం అని పేర్కొన్నారు.ఈ కస్టడీ పిటిషన్పై వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను మంగళవారం వరకు వాయిదా వేసింది. కోర్టు నిర్ణయంపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. నిందితులకు పోలీస్ కస్టడీ లభిస్తే, ఈ నెట్వర్క్ ఏ ప్రాంతాల వరకు విస్తరించింది అనే అంశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.చూడాలి మరి, కోర్టు తదుపరి నిర్ణయం ఏ విధంగా ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa