పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో, ఇరాన్లో నివసిస్తున్న భారతీయులకు భారత రాయబార కార్యాలయం అత్యవసర సూచనలు జారీ చేసింది. హార్ముజ్ జలసంధి అంశంపై అమెరికా అధ్యక్షుడు Donald Trump విధించిన గడువు ముగియబోతున్న నేపథ్యంలో, అక్కడి భారతీయులు వచ్చే 48 గంటలు పూర్తిగా ఇళ్లలోనే ఉండాలని సూచించింది.ప్రత్యేకంగా సైనిక ప్రాంతాలు, విద్యుత్ కేంద్రాల వద్దకు వెళ్లకుండా దూరంగా ఉండాలని, ఎత్తైన భవనాల్లో పై అంతస్తుల్లో ఉండకూడదని స్పష్టం చేసింది.అత్యవసర పరిస్థితుల్లోనే హైవేలపై ప్రయాణించాల్సి ఉంటే, తప్పనిసరిగా ఎంబసీతో సమన్వయం చేసుకోవాలని సూచించింది. హోటళ్లలో ఉన్నవారు బయటకు వెళ్లకుండా లోపలే ఉండి అధికారులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని కోరింది.ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, అక్కడ సుమారు 9,000 మంది భారతీయులు ఉండగా, ఇప్పటివరకు దాదాపు 1,800 మంది స్వదేశానికి తిరిగి వచ్చారు. మిగతా వారు ఎంబసీ విడుదల చేసే అధికారిక సమాచారం పై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని రాయబార కార్యాలయం తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa