కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ మధ్య జరిగిన సమావేశం ఆహ్వానించదగ్గ పరిణామమని ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. భవిష్యత్ రాజకీయల్లో జరగబోయే పరిణామాలకు ఈ సమావేశం నాంది పలుకుతుందని తెలిపారు. యువత రాజకీయాల్లోకి రావాలని అమిత్ షా ఎప్పుడూ కోరుకుంటారని చెప్పారు.
జూనియర్ ఎన్టీఆర్ కు ఎంతో రాజకీయ చైతన్యం ఉందని, ఆయనలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. 2009 ఎన్నికల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రచారాన్ని నిర్వహించారని చెప్పారు. అవినీతిపరులను బీజేపీ దగ్గరకు రానీయదని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో తమకు సంబంధం లేదని ఏపీకి చెందిన కొందరు నేతలు వారంతట వారే ముందుకొచ్చి చెప్పుకుంటున్నారని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa