ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్రిసభ్య కమిటీ నియామకాన్ని తప్పుపట్టిన ఏపీ హైకోర్టు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 31, 2022, 08:06 PM

ఏపీ హైకోర్టులో పలుమార్లు ఏపీ సర్కార్కు ఎదురుదెబ్బలు తగిలిన విషయం తెలిసిందే. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలకవర్గం ఎన్నిక వ్యవహారంలో హైకోర్టులో జగన్ సర్కార్‌కు ఎదురు దెబ్బ తగిలింది. పాలకమండలిని రద్దు చేయడంతో పాటూ బ్యాంకు కార్యాకలాపాలను పర్యవేక్షించేందుకు త్రిసభ్య కమిటీని నియమించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఈ నియామకం చట్ట విరుద్ధమని.. త్రిసభ్య కమిటీని నియమిస్తూ కొవ్వూరు డివిజనల్ కో ఆపరేటివ్ అధికారి.. ఈ నెల 26న ఇచ్చిన ఉత్తర్వుల్ని సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదుల్ని ఆదేశించింది.


కొవ్వూరు కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలకవర్గంలో 11 స్థానాలకు జులై 25న టీడీపీ మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ పాలకవర్గాన్నిరద్దు చేయడంతో పాటూ బ్యాంకు కార్యాకలాపాల పర్యవేక్షణకు కొవ్వూరు డివిజినల్ కో ఆపరేటివ్ అధికారి ఆగస్టు 26న త్రిసభ్య కమిటీగా నియమిస్తూ ఉత్తర్వుల్ని జారీ చేశారు. ఆ ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ శివరామ్ , చినబాబాబు హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ కారణాలతో పాలకవర్గాన్ని రద్దు చేశారని.. త్రిసభ్య కమిటీ ఏర్పాటు చట్టి విరుద్ధమని లాయర్ వాదనలు వినిపించగా.. ఆ వివరాలను పరిగణలోకి తీసుకున్న జడ్జి కమిటీ ఏర్పాటు ఉత్తర్వుల్ని సస్పెండ్ చేశారు.


కొవ్వూరు కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన కొవ్వూరు అర్బన్ బ్యాంకు ఎన్నికలను రద్దుచేసి ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేసిన జగన్‌కి.. హైకోర్టు ఇచ్చిన తీర్పు చెంపపెట్టులాంటిది అన్నారు. బ్యాంక్ పాలక వర్గం స్థానంలో ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ చట్ట విరుద్ధమని హైకోర్టు తీర్పు ద్వారా స్పష్టం చేసింది అన్నారు. వ్యక్తులు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన అధికార వ్యవస్థలను సైతం జగన్ భ్రష్టుపట్టించారని.. న్యాయబద్ధంగా జరిగిన ఏ ఎన్నికల ఫలితాన్ని అంగీకరించేందుకు సీఎం సిద్ధంగా లేరని మళ్లీ రుజువైంది అన్నారు. అయితే తన పంతమే ఫైనల్ కాదని.. న్యాయ వ్యవస్థ ఉందని జగన్ రెడ్డి గుర్తించాలి అన్నారు. ఇప్పటికైనా చట్టాలకు, నిబంధనలకు లోబడి పనిచేయడం నేర్చుకోవాలి అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa