వినాయచవితి వస్తే చాలు కళాకరులు తమ కళను ప్రదర్శిస్తుంటారు. తిరుపతి జిల్లా తుమ్మలగుంటలో పైనాపిల్ వినాయకుడు కొలువుదీరాడు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు ఆవిష్కరించారు. పైనాపిల్ గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏటా వినాయక చవితిని పురస్కరించుకొని ప్రత్యేకతను చాటుకునేలా.. పర్యావరణ పరిరక్షణకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కృషి చేస్తున్నారని ప్రశించారు భూమన. పర్యావరణ పరిరక్షణకు ఆధ్యాత్మిక వాతావరణంలో సంకల్పించడం అభినందనీయం అన్నారు.
భారీ పైనాపిల్ వినాయకుని ప్రతిమను ఏర్పాటు చేసేందుకు 25 మంది కార్మికులు 16 రోజులు పాటు శ్రమించి 7వేల పైనాపిల్స్తో భారీ వినాయకుడ్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రముఖ ఆర్కిటెక్చర్ మురళి సారధ్యంలో 22 అడుగులు ఎత్తు, 15 అడుగుల వెడల్పుతో అతి పెద్ద పైనాపిల్ వినాయకుని ప్రతిమను సిద్దం చేశారు. బాల వినాయక కమిటీ ఛైర్మన్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డితో పాటు సభ్యులందరూ పర్యావరణ పరిరక్షణకు విశేష కృషి చేస్తున్నారని అభినందనలు తెలిపారు.
పైనాపిల్ వినాయకుని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అంతేకాదు ఆ ప్రాంగణంలో మంగళ వాయిద్యాలు వాయిస్తున్నట్లు ఉన్న బాల వినాయకులు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు. చెరుకు గడలతో పైనాపిల్ వినాయక మండపాన్ని అందంగా తీర్చిదిద్దారు. అలాగే 1116 కిలోల లడ్డూ పైనాపిల్ వినాయకుడి ముందు ఏర్పాటు చేశారు. వేద పండితుల ముఖ్య అతిథులను ఆశీర్వదించారు. పర్యావరణ పరిరక్షణ కోసం పైనాపిల్ వినాయకుడ్ని ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa