ఎప్పటికైనా న్యాయానిదే అంతిమ విజయం అన్న సంగతి మరవకూడదు. ఓ వ్యక్తి ముచ్చటపడి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేశాడు. ఆ ఆనందం ఎంతోసేపు లేదు.. వాహనం ఊరికే మొరాయిస్తోంది. మానసిక వేదనకు గురైన ఫిర్యాదు దారుడికి వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్లో పిటిషన్ వేసి విజయం సాధించాడు. కర్నూలు జిల్లా అవుకు గ్రామానికి చెందిన శంకరశర్మ ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేశాడు. ఎలక్ట్రిక్ వాహనాన్ని 2018 మే నెలలో రూ.72,900కు కొనుగోలు చేయగా.. అదే ఏడాది ఆగస్టులో డెలివరీ చేశారు.
అప్పటి నుంచి వాహనం మొరాయించింది. మరమ్మతులు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో శర్మ తనకు న్యాయం చేయాలంటూ 2021 సెప్టెంబర్ 25న వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ను ఆశ్రయించారు. వాదనలు విన్న కమిషన్ ఈ నెల 10న తుది విచారణ చేపట్టి.. తయారీ సంస్థతో పాటు ఇద్దరు డీలర్లు కొత్త వాహనం, లేని పక్షంలో తాము సూచించిన విధంగా నష్టపరిహారాన్ని చెల్లించాలంటూ తీర్పును ఇచ్చింది.
పాత వాహనం స్థానంలో కొత్త స్కూటర్ ఇవ్వడం.. లేదంటే స్కూటర్ కొనుగోలుకు వెచ్చించిన మొత్తం, మరమ్మతు ఖర్చులు, రిజిస్ట్రేషన్ చార్జీలు కలిపి రూ.77,657ను 6 శాతం వడ్డీతో వాహనం కొనుగోలు చేసిన తేదీ నుంచి లెక్కగట్టి చెల్లించాలని ఈనెల 25న తతీర్పు ఇచ్చింది. అలాగే ఫిర్యాదు దారుడు శర్మ మానసిక వేదనకు గురైన కారణంగా రూ.10 వేలు, కోర్టు ఖర్చులు రూ.5 వేలు అదనంగా అందించాలని ప్రతివాదులను ఆదేశించింది. ఈ మేరకు చదివి వినిపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa