ఓ వ్యాపారి ఏకంగా 40 మందికి టోకర పెట్టి రూ.6 కోట్లతో ఉడాయించిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో నెలకొంది. ఈ జిల్లాలో ఘరానా మోసం బయటపడింది. ఓ వ్యాపారి రూ.6కోట్లకుపైగా వసూలు చేసి నిండా ముంచారంటూ బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. అతడు పారిపోయాడంటూ ఫిర్యాదు చేశాడు. పలాసకు చెందిన జీడిపప్పు వ్యాపారి అప్పుల రూపంలో తెలిసివారి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు. దాదాపు రూ.6 కోట్ల వరకు తీసుకుని.. గతనెల 15 నుంచి ఇతను కనిపించకుండాపోయాడు. అనుమానం వచ్చి అప్పు ఇచ్చిన వారంతా ఆరా తీయగా పరారైనట్లు తేలింది.
ఈ మేరకు పలువురు బాధితులు పోలీస్స్టేషన్నకు వెళ్లి జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశారు. ఈ వ్యాపారి బాధితులు సుమారు 40 మంది వరకు ఉంటారని చెబుతున్నారు. డబ్బుల విషయమై ఎప్పటికప్పుడు అడుగుతుండగా తనకున్న ఆస్తులు విక్రయించి అప్పులు తీరుస్తానని చెప్పుకొచ్చాడట. రెండు నెలలు క్రితం వరకు నమ్మబలికి.. తీరా ఇప్పుడు తమను మోసం చేశాడని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతేడాది కూడా పలాసలో ఓ వ్యాపారి సుమారు రూ.9 కోట్లు వసూలు చేసి పారిపోయాడు. కొద్దిరోజుల తర్వాత ఇంటికి వచ్చాడు.. బాధితులతో సమావేశం నిర్వహించి తాను బకాయిలు తీర్చలేనని.. తన దగ్గర ఎటువంటి ఆస్తులు లేవు అన్నాడు. మళ్లీ వ్యాపారం చేసి అప్పులు తీరుస్తానన్నాడు. ఎక్కువగా జీడిపప్పు లావాదేవీల్లోనే ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa