ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమాజాన్ని మార్చేందుకు విద్య ముఖ్యమైన సాధనం అని గట్టిగా నమ్మిన వ్యక్తి ఆయన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 05, 2022, 02:58 PM

వైసీపీ ప్రభుత్వం విద్యారంగానికి పెద్ద పీట వేస్తుంద‌ని విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ తెలిపారు. విజయవాడ ఏ కన్వెన్షన్‌ సెంటర్‌లో గురుపూజోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ... డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ గారు మన ఆంధ్రా యూనివర్శిటీ వీసీగా పనిచేయడం మనందరికీ గర్వకారణం. అందరూ కలిసి మెలిసి మెలగాలి, సమాజాన్ని మార్చేందుకు విద్య ముఖ్యమైన సాధనం అని గట్టిగా నమ్మిన వ్యక్తి ఆయన, వారి ఆలోచనలకు అనుగుణంగా ఉపాధ్యాయ వర్గమంతా పనిచేయాలని నేను ఆకాంక్షిస్తున్నా అన్నారు.  


అలానే గురు పూజోత్సవం సందర్భంగా అవార్డులు స్వీకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. కోవిడ్‌ కారణంగా రెండేళ్ళుగా టీచర్స్‌ డే జరుపుకోలేకపోయాం, అయినా కూడా ఉపాధ్యాయులు విద్యార్ధులకు భోదనా కార్యక్రమాలు చేపట్టిన తీరు ఎంతో అభినందనీయం. ఉత్తమ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకం, విద్యార్ధులకు విద్యను నేర్పి, విజ్ఞానం నింపి, వారికి మానవతా విలువలు పెంపొందిస్తూ ఎందరినో ఉన్నతస్ధాయికి చేర్చిన ఉపాధ్యాయవర్గాల వారికి నా వందనాలు అని అయన తెలియజేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa