వైద్యులపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. కేవలం ఆస్పత్రిని ఆలస్యంగా తెరిచినందుకు డాక్టర్ అనతి కుమారుడిపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. బారామతి జిల్లాలో ఇది జరిగింది. సాంగ్వి ప్రాంతానికి చెందిన డాక్టర్ యువరాజ్ గైక్వాడ్ తన ఇంట్లోనే క్లీనిక్ నిర్వహిస్తున్నాడు. ఈ నెల 6వ తేదీన సాయంత్రం సమయానికి క్లినిక్ డోర్ తెరవలేదు. భోజనం చేసిన తర్వాత.. తీరిగ్గా ఓపెన్ చేశారు.
గైక్వాడ్ తన కుటుంబంతో కలసి రాత్రి భోజనం చేస్తుండగా కొంతమంది తలుపు తట్టారు. అయితే తలుపు తెరవడం ఆలస్యం అవ్వడంతో బయట ఉన్న వ్యక్తులు.. అతని కిటికీ అద్దాన్ని పగులగొట్టారు. ఆనంద్ అలియాస్ అనిల్ జగ్తాప్, విశ్వజీత్ జగ్తాప్, అశోక్ జగ్తాప్, భూషణ్ జగ్తాప్ అనే వ్యక్తులు డాక్టర్ ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి అతనిని చితక్కొట్టారు. డాక్టర్ గైక్వాడ్తోపాటు అతడి కుమారుడిపై దాడి చేశారు. అప్పటికే ఒక రోగి బయట వేచి ఉండడం వల్ల వారికి ఒక్కసారిగా కోపం వచ్చింది. దాంతో వారు అలా విరుచుకుపడ్డారు.
దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో ఒకరు డాక్టర్ కొడుకును గది నుంచి బయటకు లాగడం, అతనిపై దాడి చేయడం కూడా చూడవచ్చు. ఒకరికొకరు తోసుకుని కొట్టుకున్నారు. ఈ సంఘటనతో ఆ ఇంట్లో ఉన్న మహిళలు భయాందోళన చెందారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa