ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వేలాది మంది అభిమానులు తరలిరాగా...ఓపెన్ టాప్ బస్సులో లంక క్రికేటర్లు

sports |  Suryaa Desk  | Published : Tue, Sep 13, 2022, 11:55 PM

శ్రీలంక క్రికెట్ జట్టుకు సొంత దేశమైన శ్రీలంకలో అపూర్వ ఘన స్వాగతం లభించింది. ఆసియా కప్ లో టీమిండియా, పాకిస్థాన్ వంటి మేటి జట్లను ఓడించి టైటిల్ నెగ్గిన శ్రీలంక జట్టుకు స్వదేశంలో ఘనస్వాగతం లభించింది. యూఏఈ నుంచి కొలంబో చేరుకున్న ఆటగాళ్లను విమానాశ్రయం నుంచి ఓపెన్ టాప్ బస్సులో ఊరేగింపుగా తీసుకెళ్లారు.  వేలాది మంది అభిమానులు తరలిరాగా లంక ఆటగాళ్లు ఆసియా కప్ ట్రోఫీని ప్రదర్శిస్తూ, తమ మద్దతుదారులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఊరేగింపు పొడవునా అభిమానులు నినాదాలు చేయగా, టోర్నీ ఆసాంతం తమకు మద్దతుగా నిలిచిన అభిమానులకు లంక ఆటగాళ్లు కృతజ్ఞతలు తెలిపారు. 


ఆదివారం దుబాయ్ లో జరిగిన ఫైనల్లో శ్రీలంక జట్టు 23 పరుగుల తేడాతో పాకిస్థాన్ ను ఓడించడం తెలిసిందే. సూపర్-4 దశలో లంకేయులు వరుసగా మూడు మ్యాచ్ లు గెలిచి తమ విజయకాంక్షను చాటారు. పాకిస్థాన్ ను సూపర్-4 దశలోనూ ఓడించిన శ్రీలంక జట్టు, అదే ఊపును టైటిల్ పోరులో కొనసాగించి ఓవరాల్ గా 6వ ఆసియా కప్ టైటిల్ ను ఖాతాలో వేసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa