ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ కేసులో..అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత అరెస్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 14, 2022, 02:08 PM

అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత అరెస్ట్ అయ్యారు. ఆమెను పంజాబ్ నేషనల్ బ్యాంకు కేసులో సీబీఐ అరెస్ట్ చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును కోట్లాది రూపాయల మేర మోసగించినట్టు కొత్తపల్లి గీతపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న సీబీఐ గతంలో కొత్తపల్లి గీతను, ఆమె భర్త రామకోటేశ్వరరావును విచారించింది. కొత్తపల్లి గీత పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.42.79 కోట్ల మేర మోసగించినట్టు అభియోగాలు మోపారు. ఈ కేసులో భాగంగా నేడు హైదరాబాదులో కొత్తపల్లి గీతను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల కోసం ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అరెస్ట్ నేపథ్యంలో, కొత్తపల్లి గీత బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa