ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అసైన్డ్ భూముల కేసు.. మాజీ మంత్రి నారాయణకు ముందస్తు బెయిల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 14, 2022, 05:16 PM

ఏపీ రాజధాని అమరావతి అసైన్డ్ భూముల కేసులో మాజీ మంత్రి నారాయణకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అసైన్డ్ భూములకు సంబంధించి అవకతవకలు జరిగాయని నారాయణపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. దీంతో ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు నారాయణకు 3 నెలల ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa