ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్యాంకుల సాంకేతిక లోపాలు...పేదలను నిరాశపర్చుతున్నాయి

national |  Suryaa Desk  | Published : Fri, Sep 16, 2022, 12:34 AM

వేల కోట్ల రూపాయలు అనుకోకుండా మనవద్ద చేరితో ఆ ఆనందానికి అవదులుండవు. ఇక  పేదోడికి పెద్ద మొత్తంలో డబ్బు అందితే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కానీ తాజాగా బ్యాంకుల్లో తలెల్తిన సాంకేతిక సమస్యలు పేదల అకస్మత్తుగా ఆనందాలు తెచ్చి గంటల వ్యవధిలోనే నిరాశపర్చుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనయే గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకొంది. గుజరాత్‌లో ఓ వ్యక్తి ఖాతాలోకి రూ.11,677 కోట్లు జమ అయ్యాయి. దాంతో ఆ వ్యక్తి సంతోషాలకు పట్టపగ్గాలు లేకుండాపోయాయి. అయితే కొన్ని గంటల్లో అతని ఆనందం ఆవిరైపోయింది. అయితే రాత్రి ఎనిమిది గంటలకు పైగా డబ్బు అతని ఖాతాలో ఉంది. తర్వాత మాయం అయ్యాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఇది జరిగింది. రమేష్ సాగర్ అనే వ్యక్తి ఐదేళ్లుగా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతున్నాడు. దీనికోసం ఏడాది కిందట కోటక్ సెక్యూరిటీస్‌లో డీమ్యాట్ ఖాతా తెరిచాడు. ఆ ఖాతా ద్వారా ట్రేడింగ్ చేస్తున్నాడు.


అయితే కరెక్టుగా నెల రోజుల కింద ఆయన ఊహించని విధంగా అతని అకౌంట్‌లో రూ.12 వేల కోట్లు వచ్చి పడ్డాయి. జూలై 26న తన డీమ్యాట్‌ ఖాతాలో రూ.116,77,24,43,277.10 కనిపంచాయి. అది చూసిన వెంటనే షాక్ అయ్యాడు. అందులోంచి తేరుకుని.. ఆ డబ్బుల్లో రెండు కోట్లను స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాడు. మరో ఐదు లక్షలకు లాభాలు బుక్ చేశాడు. అయితే అదేరోజు రాత్రి 8 గంటల సమయంలో ఆ డబ్బంతా మాయమైంది. బ్యాంకు నుంచి ఓ మెసెజ్ కూడా వచ్చింది.


"జూలై 26, 2022న నా ఖాతాలో రూ. 116,77,24,43,277.10 కోట్లు వచ్చాయి. అందులో నేను స్టాక్ మార్కెట్‌లో రూ. రెండు కోట్లు పెట్టుబడి పెట్టాను. రూ. 5 లక్షల లాభాన్ని బుక్ చేసుకున్నాను. ఆ రోజు సాయంత్రం దాదాపు 8 నుంచి 8.30 గంటల వరకు బ్యాంకు ఆ మొత్తాన్ని ఉపసంహరించుకుంది." అని రమేష్ సాగర్ చెప్పుకొచ్చాడు. తర్వాత రమేష్‌కు ఒక మెసెజ్ వచ్చింది.


దాని ప్రకారం యాప్‌లోని మార్జిన్ అప్‌డేట్‌లో సమస్య వచ్చిందని.. దీనివల్ల ఇలా జరిగిందంటూ ఆ బ్యాంకు నుంిచ అతడికి మెసేజ్ వచ్చింది. విచిత్రమేమిటంటే ఆ రోజున కోటక్ సెక్యూరిటీస్‌ యాప్‌లో సాంకేతిక సమస్య వల్ల రమేష్ సాగర్‌లానే మరికొంత మంది వ్యక్తుల ఖాతాల్లో కూడా కోట్లలో డబ్బులు జమ అయ్యాయి. దాంతో కొన్ని గంటల పాటు చాలామంది కోటీశ్వరులయ్యారు.


గతంలో ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఒక కూలీ జన్‌ధన్ ఖాతాలో రూ.2,700 కోట్లు వచ్చిపడ్డాయి. బీహార్‌లాల్ (45) అనే వ్యక్తి.. రాజస్థాన్‌లో కూలీగా పనిచేస్తుంటాడు. అయితే సొంత గ్రామానికి వచ్చిన ఆయన తన ఖాతా నుంచి వంద రూపాయలు డ్రా చేసుకున్నాడు. తర్వాత మొబైల్ ఫోన్‌కు వచ్చిన మెసెజ్‌ ద్వారా ఖాతాలో రెండు వేలకుపైగా కోట్లు ఉన్నట్టు తెలిసింది. తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. దాంతో వెంటనే బ్యాంకుకు వెళ్లాడు.. కానీ అక్కడ పరిశీలిస్తే.. కేవలం రూ.126లే ఉన్నాయి. అయితే తనకొచ్చిన మెసెజ్ చూపించగా.. బ్యాంకింగ్ పొరపాటు వల్ల అలా వచ్చి ఉంటుందని అక్కడ సిబ్బంది చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa