ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుండె ఆగిన...ఆమె మంత్రం బతికింది

national |  Suryaa Desk  | Published : Fri, Sep 16, 2022, 12:37 AM

గుండె ఆగితే మనిషి చనిపోయినట్లేనని ఎవరైనా చెబుతారు. కానీ ఓ మహిళా గుండె ఆగినా ఆమె మాత్రం బతికింది. మనుషులకు కొన్ని నిమిషాలు గుండె కొట్టుకోవడం ఆగిపోతే.. మరణించినట్టే లెక్క. అందుకే గుండెల్లో ఏ మాత్రం అసౌకర్యంగా ఉన్న వెంటనే డాక్టర్లను కలుస్తుంటారు. అలాంటిది ఓ యువతికి 210 నిమిషాలుపాటు గుండె ఆగిపోయింది. అయినా సరే వైద్యులు ఆమెను బతికించారు. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.


లోనిన కంకర్ ఖేడా జిల్లాకు రాజు తన భార్య కవితను (34) ఆస్పత్రికి తీసుకెళ్లాడు. గత రెండేళ్లుగా ఆమె ఛాతినొప్పితో బాధపడుతుంది. అయితే ఆమెను పరీక్షించిన డాక్టర్లు కొన్ని టెస్ట్‌లు చేసి.. వ్యాధి ఏమిటో తెలుసుకున్నారు. ఆమెకు వాల్వ్ దెబ్బతినడం వలన ఈ విధంగా జరిగిందని వైద్యులు తెలియజేశారు. వెంటనే మిట్రల్ వాల్వ్ మార్చడానికి ఆపరేషన్ చేయాలని వైద్యులు నిర్ణయించారు.


ఈ మేరకు లాలా లజపత్ రాయ్ మెడికల్ ఆస్పత్రిలో కవితకు మిట్రల్ వాల్వ్ రీప్లేస్‌మెంట్, ఓపెన్ హార్ట్ బైపాస్ సర్జరీ చేశారు. ఆ ఆపరేషన్ చేస్తున్న క్రమంలో ఆమెకు గుండె కొట్టుకొవడం ఆగిపోయింది. దాంతో వైద్యులు ఆమె గుండెను ఆర్టిఫిషియల్ యంత్రాలతో కొట్టుకునేలా చేశారు. ఈ ఆపరేషన్ ను డాక్టర్ రోహిత్ చౌహన్ ఆధ్వర్యంలోని డాక్టర్లు నిర్వహించారు. కొన్ని గంటలపాటు శ్రమించి.. విజయవంతంగా శస్త్రచికిత్సను పూర్తి చేశారు. అయితే అన్ని గంటల పాటు మహిళ గుండె ఆగిపోవడంతో.. ఆమె బతుకుతుందా..? లేదా..? అని వైద్యులే సందేహించారు. కానీ డాక్టర్లే నిర్ఘాంతపోయే విధంగా.. ఆమె బతికింది. ప్రస్తుతం కవిత పరిస్థితి మెరుగ్గానే ఉంది.. ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఆమె కోలుకుంటుంది. ఈ సందర్భంగా గుండెకు సంబంధించిన అనేక వ్యాధులు ఉన్నాయని, వాటికి సరైన రీతిలో సకాలంలో ఆపరేషన్‌లు చేస్తే నయం అవుతాయని డాక్టర్ రోహిత్ కుమార్ చౌహాన్ చెప్పారు. గుండె జబ్బులకు చివరి దశలో కాకుండా ముందుగానే గుర్తించాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa