ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరద బాధితులకు నిత్యావసరాల పంపిణీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 16, 2022, 11:41 AM

గోదావరి వరద బాధితులకు గురువారం యానాం వర్తక సంఘం ఆధ్వర్యంలో రూ. 3 లక్షలు విలువచేసే నిత్యావసరాలు కిట్లను మాజీ మంత్రి, పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణా రావు అందజేశారు. స్థానిక గీతామందిరంలో జరిగిన కార్యక్రమంలో 600 మంది బాధితులకు నూనె, పప్పులు, నూక తదితర 14 రకాల సామగ్రితో కూడిన కిట్లను గోదావరి నదిని చేర్చి ఉన్న గురుకృ ష్ణాపురం నుంచి రాజీవ్ బీచ్ వరకు ఉన్న నివాసితులకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ సామాజిక సేవా దృక్పథంతో కష్టకాలంలో బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన యానాం వర్తక సంఘం సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎఓ అమన్ శర్మ, ఎస్పీ బాలచంద్రన్, వర్తకసంఘం అధ్యక్షుడు నల్లా వెంకన్న, గౌరవ అధ్య క్షుడు మాజేటి సత్యభాస్కర్, కార్యదర్శి కాపగంటి గోపాలకృష్ణ గాజుల బ్రహ్మానందం (బాబి), కాపగంటి కొండబాబు, తాజుద్దీన్, తిక్కిరెడ్డి సత్యానందం, కనకాల శ్రీసు, లకమన సుబ్బారావు, కుమార్, నల్లం రాము పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa