మూడు రాజధానుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి సుప్రీంకోర్టులో భంగపాటు తప్పదని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అభిప్రాయపడ్డారు. బాపట్ల జిల్లాలో అమరావతి రైతుల మహా పాదయాత్రలో ఎంపీ కనకమేడల పాల్గొని మద్దతు తెలిపారు. మూడు రాజధానుల విషయంలో ఏపీ హైకోర్టు తీర్పును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేయడంపై ఆయన ఘాటుగా స్పందించారు.
ఈ సందర్భంగా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ మాట్లాడుతూ.. శాసన వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ఏపీ హైకోర్టు తీర్పు ఇవ్వలేదని.. కేవలం దురుద్దేశంతోనే ఉన్నత న్యాయస్థానం తీర్పును వక్రీకరిస్తున్నారని విమర్శించారు. హైకోర్టు తీర్పు ప్రకారం రాజధాని అమరావతి నిర్మాణం చేపట్టకుండా 6 నెలలు కాలయాపన చేసి.. ఇప్పుడు సుప్రీం కోర్టుకు వెళ్లారని ఆయన దుయ్యబట్టారు. రాజధాని విషయంలో జగన్ సర్కారుకు మరోసారి భంగపాటు తప్పదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa