మోదీ పుట్టిన రోజును పురష్కరించుకొని తమిళనాడులోని బీజేపీ నేతలు విన్నూత్నంగా సంబరాలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ 72వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన పుట్టినరోజు వేడుకలను గతానికి భిన్నంగా జరుపుకోవాలని బీజేపీ నిర్ణయించింది. సహజంగా మోదీ జన్మదినం రోజున ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు ఆయన ఆరోగ్యం కోసం పూజలు, హోమాలు, భారీ ఎత్తున కేక్లు కట్ చేయడం లాంటివి చేస్తుంటారు. కానీ, ఈసారి పలు కార్యక్రమాలను భారీ ఎత్తున చేపట్టారు. తమిళనాడు బీజేపీ వినూత్నంగా ప్లాన్ చేసింది. సెప్టెంబరు 17న పుట్టిన పిల్లలకు బంగారు ఉంగరాలను కానుకగా ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో పాటు బేబీ కిట్లను వారికి అందజేయనున్నారు.
తమిళనాడు రాష్ట్ర బీజేపీ వర్గాల ప్రకారం.. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినమైన సెప్టెంబరు 17న పుట్టిన పిల్లలకు బంగారు ఉంగరాలను అందజేయనున్నారు. రూ.5 వేలు ఖరీదుచేసే 2 గ్రాముల బంగారు ఉంగరంతో పాటు బేబీ కిట్లు ఇవ్వనున్నట్టు తెలిపాయి. చెన్నై రొయాపురంలోని ఆర్ఎస్ఆర్ఎం ఆస్పత్రిలో లబ్దిదారులకు బంగార ఉంగరంతో పాటు బేబీ కిట్లను కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ అందజేస్తారు.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గం కొలతూరులో 750 కిలోల చేపలను పంపిణీ చేయనున్నారు. ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన కింద మంత్రి చేపల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కాంచీపురంలో రక్తదాన శిబిరానికి కేంద్ర మంత్రి హాజరవుతారు. అనంతరం దేశవ్యాప్త రక్తదాన కార్యక్రమం రక్తదాన అమృతమహొత్సవాన్ని అవడిలో ప్రారంభిస్తారు.
ప్రధాని నరేంద్ర మోదీకి కామన్వెల్త్ క్రీడాకారులు అందించిన సుమారు 1200 రకాలు బహుమతులను వేలం వేయనున్నారు. మోదీ పుట్టిన రోజు నాడు ఈ వేలం జరుగుతోంది. ఈ ఆక్షన్ ద్వారా వచ్చిన డబ్బులను నమామి గంగే ప్రాజెక్టు కోసం నరేంద్ర మోదీ విరాళంగా అందజేయనున్నారు. కొన్ని వినాయకుడి ప్రతిమలు, అయోధ్య నమూనా ఆలయం, వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయం నమూనాలు కూడా మోదీకి వచ్చిన బహుమతుల్లో ఉన్నాయని, వాటిని కూడా వేలం వేస్తున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa