ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోదీపై ప్రేమను అలా వ్యక్తంచేశారు...ఒక్కోరు ఒకోలా

national |  Suryaa Desk  | Published : Sat, Sep 17, 2022, 08:27 PM

తమ అభిమాన నేత పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు వివిధ రూపాల్లో తమ అభిమానాన్ని చాటుతుంటారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు చాలా వినూత్నంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.నరేంద్ర మోదీ 72వ పుట్టినరోజు కావడంతో శనివారం ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది సరికొత్త పద్ధతిలో ప్రధానిపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటుననారు. ఒడిశాలో సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్.. కూడా ఇదే బాటపట్టారు. 1200లకు పైగా టీ కప్పులతో ప్రధానికి బర్త్‌డే విషెస్ చెప్పారు. ఆయన 1213 మట్టి టీ కప్పులను ఉపయోగించి మధ్యలో నరేంద్ర మోదీ చిత్రంతో ఒడిశా పూరీ బీచ్‌లో సైకత శిల్పం రూపొందించారు.


ఆ సైకత శిల్పంలో హ్యాపీ బర్త్‌డే మోదీ అని రాసి.. శుభాకాంక్షలు తెలియజేశారు. ఐదు ఫీట్ల పొడవున్న ఈ శిల్పం కోసం సుదర్శన్ పట్నాయక్ ఐదు టన్నుల ఇసుకను వినియోగించారు. "టీ అమ్మే వ్యక్తి నుంచి దేశ ప్రధాని అయ్యే వరకు నరేంద్ర మోదీ ప్రయాణాన్ని చూపించడానికి మేము ఈ మట్టి టీ గ్లాసులను ఉపయోగించాం. నేను నా కళ ద్వారా ప్రధానమంత్రికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను." అని సుదర్శన్ పట్నాయక్ అన్నారు.


నరేంద్ర మోదీ మరో వీరాభిమాని ఉత్తరప్రదేశ్‌వారణాసిలోని విజయ్ గుప్తా.. వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేశారు. గత ఎనిమిదేళ్లుగా ప్రధాని చేసిన అభివృద్ధి పనులను, విదేశీ పర్యటనలను.. ఇతర కార్యక్రమాలకు సంబంధించిన పేపర్ కటింగ్‌లను తన పాన్‌ షాపులో అతికించుకున్నాడు. అది ఇప్పుడు అందరినీ తెగ ఆకట్టుకుంటుంది. మరోవైపు ఢిల్లీలో ఓ రెస్టారెంట్ యజమాని కూడా ఆయనపై అభిమానంతో స్పెషల్ ఆఫర్ కూడా పెట్టాడు. రెస్టారెంట్‌లో పది రోజుల పాటు 56 అంగుళాల థాలీని అందించడంతో పాటు.. రూ.8.5 లక్షలను గెలుచుకునే అవకాశాన్ని కూడా కల్పించారు. అంతేకాదు లక్కీ డ్రా ద్వారా కేదార్‌నాథ్‌కు ఉచిత యాత్రకు వెళ్లే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు.


తమిళనాడులో కూడా బీజేపీ నాయకులు కూడా ప్రధాని నరేంద్ర మోదీ బర్త్ డే సందర్భంగా వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. శనివారం పుట్టిన పిల్లలకు రెండు గ్రాముల బంగారు ఉంగరాలను అందజేస్తున్నారు. అంతేకాకుండా వారికి బేబీ కిట్‌లను కూడా ఇస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో చేపలను కూడా పంచుతున్నారు. మరోవైపు ప్రధానికి ప్రముఖ క్రీడాకారులు కూడా మోదీకి బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. క్రికెట్‌ దిగ్గజం సచిన్ టెండుల్కర్, విరాట్ కొహ్లీలు, సైనా నెహ్వాల్ వంటి క్రీడాకారులు .. ప్రధానికి గ్రీటింగ్స్ తెలియజేస్తూ ట్వీట్లు పెట్టారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న ఫోటోలను కూడా షేర్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa