ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగువారు మాతృభూమిపై మమకారంతో, పవన్ కల్యాణ్ పై అభిమానంతో జనసేన పార్టీకి అండగా నిలుస్తున్నారని పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు నాగబాబు కొనియాడారు. వారందరి నమ్మకాన్ని నిలబెడతామని నాగబాబు స్పష్టం చేశారు. రేపు (సెప్టెంబరు 18) జనసేన పార్టీ లీగల్ సెల్ సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమానికి జనసేనాని పవన్ కల్యాణ్ కూడా హాజరవుతున్నారు. ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నారు.
నా సేన కోసం... నా వంతు..., కౌలు రైతు భరోసా వంటి కార్యక్రమాల కోసం యూరప్ జనసైనికులు జనసేన పార్టీకి రూ.5.55,555 విరాళంగా అందించారు. దీనిపై పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు నాగబాబు స్పందించారు. యూరప్ జనసైనికులు భారీ విరాళం అందించడం అభినందనీయమని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa