ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అసెంబ్లీ వద్ద ఓ భవనం ఎక్కి టీడీపీ నేతలు హల్చల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 20, 2022, 01:20 PM

అసెంబ్లీ సమీపంలోని ఓ భవనంపైకి ఎక్కి తెలుగుదేశం పార్టీ నేతలు నిరసన చేపట్టారు. ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టిందని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు నేతలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి అంటూ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు, కార్యకర్తలు నినాదాలు చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు టీడీపీ నేతలు, కార్యకర్తలను భవనంపై నుంచి బలవంతంగా కిందికి దించి అరెస్టు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa