ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేవినేని వెంకట రమణ ప్రజల గుండెల్లో ఉంటారు..!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 20, 2022, 01:21 PM

దివంగత నేత మాజీ మంత్రి స్వర్గీయ దేవినేని వెంకటరమణ జయంతి వేడుకలు గొల్లపూడి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగాయి. టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి దేవినేని రమణ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవినేని రమణ భౌతికంగా దూరం అయినా సూర్య చంద్రులున్నంత కాలం ప్రజల గుండెల్లో నిలిచి ఉంటారని అన్నారు. ఒక కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించిన దేవినేని రమణ అన్న ఎన్టీఆర్, చంద్రబాబు నాయకత్వంలో నాయకుడిగా, శాసనసభ్యుడిగా, విద్యాశాఖ మంత్రిగా ప్రజలకు సేవలందించారని గుర్తుచేశారు. శాసనసభలోకి అడుగుపెట్టకముందే కాలవలు పూడిక తీయించిన ఘనత దేవినేని రమణదని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేపట్టిన శ్రమదానం కార్యక్రమంలో రాష్ట్రానికి స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa