ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల ను ప్రకటించిన తిరుమల దేవస్థానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 20, 2022, 01:21 PM

నవంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన (రూ.300) టికెట్లను సెప్టెంబరు 21న ఉదయం 9 గంటలకు విడుదల చేయ‌నున్నట్లు తిరుమల దేవస్థానం    ప్రకటించింది. నవంబర్ నెలలో శ్రీవారికి నిర్వహించనున్న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవ, ఆర్జిత సేవా టికెట్లను సెప్టెంబర్‌ 21వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు TTD  తెలిపింది. టికెట్ల లభ్యతను బట్టి మొద‌ట వ‌చ్చిన వారికి మొద‌ట ప్రాతిపదికన కేటాయించనున్నట్లు పేర్కొంది. నవంబర్ నెల శ్రీవారి ఆర్జిత సేవా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సెప్టెంబర్ 21వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుందని వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa