బాసట సేవా సంస్థ నిస్వార్ధంగా చేస్తున్న సేవా కార్యక్రమాలకు తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని కర్నూలు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ( డ్వామ) ప్రాజెక్ట్ డైరెక్టర్ అమర్నాధరెడ్డి అన్నారు. బాసట సంస్థ 13వ వార్షికోత్సవం సంస్థ అధ్యక్షులు మేరువ బాలాజీ రావు అధ్యక్షతన సి. పి. బ్రౌన్ గ్రంధాలయంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన అమర్నాధరెడ్డి మాట్లాడుతూ నలుగురు సభ్యులతో మొదలైన బాసట జిల్లాలు, రాష్ట్రం దాటి ఇతర రాష్ట్రాల్లో కూడా సేవలు అందించిందని చెప్పారు. 144 ఆదివారాలు రిమ్స్లో రోగుల సహాయకులకు అల్పాహారం అందించడం అంటే సేవల పట్ల బాసట కు ఉన్న అంకితభావానికి నిదర్శనమన్నారు.
కార్యక్రమంలో జిల్లా గాలేరు నగరి సుజల స్రవంతి డిప్యూటీ కలెక్టర్ కె. పి. నరసింహులు, రిటైర్డ్ అసిస్టెంట్ ఇంజనీర్ వెంకటరెడ్డి, విజయవాడ డెంటల్ కాలేజ్ డీన్ డాక్టర్ ఎస్. బాలసుబ్రమణ్యం, శాంతినికేతన్ పాఠశాల కరస్పాండెంట్ ఎస్. ఇలియాస్ రెడ్డి, కడప జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ డాక్టర్ బ్రహ్మం, సి. పి. బ్రౌన్ లైబ్రరీ బాధ్యులు డాక్టర్ మూల మల్లికార్జున రెడ్డి, సురేష్ బాబు, లయన్. కె. చిన్నపరెడ్డి, విశిష్ట అతిథులుగా హాజరై బాసట సంస్థ అందిస్తున్న సేవా కార్యక్రమాలు, సామాజిక సేవ కార్యక్రమాల గురించి వివరించారు. అనంతరం బీటెక్ చదువుతున్న మాధవికి రూ. 30వేలు, నగరంలో బీటెక్ చదువుతున్న షఫీ అనే విద్యార్థికి రూ. 8 వేలు, బీటెక్ విద్యార్థినులు బలపాల వర్షిత రూ. 16 వేలు రూ. 54 వేలు ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో అందించారు. కార్యక్రమంలో విద్యార్థులు, అధికారులు, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa