శ్రీకాకుళం: నరసన్నపేట శాసనసభ్యుడు, జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి చేరుకొని పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పుడు విజయవాడ వచ్చిన అమ్మవారిని దర్శించుకోవడం ఒక ఆనవాయితీగా కొనసాగిస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం పలికారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa