వంట గ్యాస్ సిలిండర్ పేలి బండ కార్మికునికి తీవ్ర గాయాలైన సంఘటన శనివారం నిమ్మనపల్లి మండలంలో చోటుచేసుకుంది. ఘటనపై బాధితుని కుటుంబ సభ్యులు ఆస్పత్రి అవుట్ పోస్ట్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిమ్మనపల్లి మండలం, పిట్టావాండ్లపల్లికి చెందిన రేపన రెడ్డప్ప కుమారుడు వెంకటరమణ (56) బండ కార్మికుని గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
ఈ క్రమంలో మదనపల్లి మండలంలోని బొమ్మచెరువు బండమీద బండ రాళ్లు తీసే పని చేసేవాడు. అక్కడే వేసుకున్న గుడారంలో వంట చేయడానికి భద్రపరిచిన గ్యాస్ సిలిండర్ ప్రమాదవశాత్తు పేలడంతో శనివారం తీవ్రంగా గాయపడ్డాడు. బాధ్యతని స్థానికులు 108 వాహనంలో హుటాహుటిన మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించగా, ఆస్పత్రి అత్యవసర విభాగం వైద్యులు ప్రథమ శిఖర్జీలు అందించి అతని పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన వైద్యం కోసం తిరుపతి రియాకు రెఫర్ చేశారు.
బొమ్మని చెరువు బండమీద రాయి కొట్టి డబ్బుతో జనాన్ని సాగించేవాడని, శనివారం రోజున బొమ్మనచెరువు బండమీద రాయి కొడుతుండగా ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ కావడంతో గ్యాస్ సిలిండర్ పేలి తీవ్రంగా గాయపడ్డాడు బాధితులని స్థానికులు 108 సాయంతో హుటాహుటిన మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం వైద్యులు బండ కార్మికుడు వెంకటరమణ కు ప్రథమ చికిత్సలు అందించి, అతని పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం వెంటనే తిరుపతి రుయాకు వెళ్లాలని సూచించారు. మదనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa