కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత కంటి వైద్యశిబిరాన్ని నిర్వహించారు. కొత్తపేట మండలం ఏనుగులమహల్ - మందపల్లి గ్రామంలోజనసేన పార్టీ యువత ఆధ్వర్యంలో కాకినాడకు చెందిన అంజు ఐ- కేర్ పౌండేషన్ ఆధ్వర్యంలోఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. ఈశిబిరంలో సుమారు వంద మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో సుమారు 20 మందికి ఆపరేషన్ చేయాల్సి ఉంది. వీరందరికీ ఉచితంగా ఆపరేషన్ చేసి కళ్ళజోళ్ళు ఉచితంగా ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వైద్య శిబిరాన్ని అమలాపురం పార్లమెంటరీ జనసేన పార్టీ ఇంచార్జ్ డిఎంఆర్ శేఖర్ సందర్శించారు. ఒక మంచి సేవా కార్యక్రమంలో పాల్గొని సేవలందిస్తున్న జనసేన యువతను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పల్లి శాంతి ఏనుగుల మహల్- మందపల్లి జనసేన యువత, కొత్తపేట మండలం జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు, పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa