ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ డ్రోన్ల వెనక కథ ఏమిటీ...విచారిస్తున్న అధికార్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 10, 2022, 10:17 PM

డ్రోన్లు ఎగిరితే..అందులోనూ ఓ ప్రఖ్యాత ఆలయం చూట్టూ తిరిగితే కాస్త ఆలోచించాల్సిన అంశమే. ఇదిలావుంటే ఏపీలో ప్రముఖ శైవక్షేత్రంగా అలరారుతున్న మహానంది ఆలయంపై డ్రోన్ కలకలం రేగింది. నంద్యాల సమీపంలోని ఈ ఆలయంపై ఓ డ్రోన్ సంచరించడాన్ని గుర్తించారు. డ్రోన్ ఆలయ ఏరియల్ వ్యూను చిత్రీకరిస్తుండగా ఆలయ వర్గాలు గమనించాయి.  డ్రోన్ ను ఆపరేట్ చేస్తున్న వ్యక్తిని గుర్తించిన సిబ్బంది, అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అతడి వాహనాన్ని కారులో వెంటాడారు. ఆరు కిలోమీటర్ల వరకు ఈ చేజింగ్ సాగింది. ఈవో చంద్రశేఖర్ రెడ్డి, ఆలయ అధికారులు అతడిని పట్టుకునేందుకు విఫలయత్నం చేశారు. డ్రోన్ ఆపరేటర్ వాహనాన్ని వారు సరిగా గుర్తించలేకపోయారు. దాంతో అతడు తప్పించుకున్నాడు.   ఈ ఘటనపై ఆలయ సిబ్బంది స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలావుంటే సీసీ ఫుటేజిలో డ్రోన్ ఆపరేటర్ దృశ్యాలు కనిపించకపోవడంతో, పోలీసులు ఇతర మార్గాల్లో దర్యాప్తు షురూ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa