ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీటీడీ డయల్ యువర్ ఈవోకు వెల్లువెత్తిన ఫిర్యాదులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 10, 2022, 11:57 PM

టీటీడీ చేపట్టిన వినూత్న కార్యక్రమానికి భక్తు నుంచి ఫిర్యాదుల వెల్లువ వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమయ్య భవననంలో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. భక్తుల సందేహాలు, ఫిర్యాదులపై ఈవో ధర్మారెడ్డిఫోన్ ద్వారా స్పందించి సమాధానం ఇచ్చారు. విశాఖపట్టణానికి చెందిన వెంకటరమణ.. భక్తులకు రుచికరమై, నాణ్యమైన అన్న ప్రసాదాలు అందజేయాలని కోరారు. తిరుమలలో లడ్డూ కౌంటర్లలో ప్రసాదాలు తీసుకోవడానికి అధిక సమయం పడుతోందని. అన్ని కౌంటర్లు పనిచేసేలా చూడాలని బెంగళూరుకు చెందిన వెంకటేష్‌ అనే భక్తుడు కోరాడు.


వరంగల్‌కు చెందిన మురళీధర్‌, హైదరాబాద్‌కు చెందిన సీత మాట్లాడుతూ.. ప్రత్యేక దర్శనం రూ.300 టికెట్లు పొందిన వారికి అదే రోజు గదులు తీసుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. క్యూలైన్‌లో దళారులు అధిక ధరలకు గదులు విక్రయిస్తున్నారని ఈవో ధర్మారెడ్డికి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం సర్వదర్శనానికి 48 గంటల సమయం పడుతోందని మడకశిరకు చెందిన రామకృష్ణ ఈవో దృష్టికి తీసుకొచ్చారు. వీఐపీ దర్శనాలు రద్దుచేసి సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని విజ్ఞప్తి చేశారు. తిరుమలలో హోటళ్లలో టిఫిన్‌ ధరలు తగ్గించాలని సత్యవేడుకు చెందిన అనిల్‌రెడ్డి కోరారు.


ఈ-దర్శన్‌ కౌంటర్లు తిరిగి ప్రారంభించాలని భక్తులు ఈవోకు విజ్ఞప్తి చేశారు. శ్రీనివాసుడి సేవకు దళారులు ఒక్కొక్కరి వద్ద రూ.400 వసూలు చేస్తున్నారని కరీంనగర్‌కు చెందిన భక్తుడు మహేందర్‌ రావు ఆరోపించారు. ఈవో మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో నేరుగా బుక్‌చేసుకునే సదుపాయం కల్పించామని.., తిరుమలేశుడి సేవకు దళారులకు డబ్బులు ఇవ్వకూడదని చెప్పారు. అన్నప్రసాదాలు రుచిగా, శుభ్రతగా అందిస్తున్నామన్నారు. బియ్యం నాణ్యతను పెంచేందుకు మిల్లర్లతో మాట్లాడి చర్యలు చేపడతామని తెలిపారు.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa