ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వచ్చే ఏడాదిలోపు రామాయపట్నం పూర్తిచేయండి: వై.ఎస్.జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 10, 2022, 11:58 PM

వచ్చే 2023 డిసెంబర్‌ కల్లా రామాయపట్నం పోర్టు పనులన్నీ పూర్తి చేయాలని అధికార్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలోని రామాయపట్నం పోర్టు కార్యకలాపాలు 2024 మార్చి కల్లా ప్రారంభం కావాలని ఆయన సూచించారు. జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్‌ హార్బర్ల పనుల పురోగతి, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పనపై సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్షించారు.


ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. 2023 జూన్‌ కల్లా పోర్టుల నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రెండో దశలో నిర్మించనున్న ఫిషింగ్‌ హార్బర్లు, ఫిష్‌ ల్యాండ్‌ సెంటర్ల నిర్మాణంపైనా దృష్టిపెట్టాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ఇక, ఎస్‌ఐపీబీలో గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన ప్రాజెక్టులు త్వరగా ప్రారంభమయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. అన్ని రకాలుగా ఆయా సంస్థలకు చేయూతనివ్వాలన్నారు. పరిశ్రమలకు చేయూత ఇచ్చేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశానికి మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, ఉన్నతాధికారులు హాజరయ్యారు.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa