దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేసుతున్న ఢిల్లీ లిక్కర్ లిక్కర్ స్కాం తాజాగా విశాఖను వణికిస్తోంది. ఈ స్కాం ఇపుడు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీలో జరిగిన ఈ కుంభకోణంలో తెలుగు రాష్ట్రాలకి చెందిన పలువురు ప్రముఖ రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలపై ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఢిల్లీ లిక్కర్ స్కాం తెలుగు రాష్ట్రాల చూట్టే తిరుగుతోంది. ఈ కేసులో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు అధికార టీఆర్ఎస్, వైసీపీ నేతలపై ఆరోపణలు వచ్చాయి. అధికార పార్టీలకు చెందిన కొంతమంది నేతల కుటుంబసభ్యుల ప్రమేయం కూడా ఈ కేసులో ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రంగంలోకి దిగిన సీబీఐ, ఈడీ సంస్థలు.. లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించింది.
తాజాగా ఈ స్కాంకు సంబంధించి మరో వార్త బయటకు వచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో విశాఖకు చెందిన కొంతమంది వ్యక్తులు, కొన్ని సంస్థల యజమానుల ప్రమేయం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. లిక్కర్ వ్యాపారంలో కొంతమంది పెట్టుబడులు పెట్టినట్లు సీబీఐ అధికారుల విచారణలో తేలినట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలో లిక్కర్ స్కాంలో కొంతమంది విశాఖ వ్యక్తులకు సీబీఐ నోటీసులు ఇవ్వబోతుందని, వారిని విచారణకు పిలుస్తారనే ప్రచారం నడుస్తోంది. ఎంత మొత్తంలో పెట్టుబడి పెట్టారు? వారికి ఆ నగదు ఎక్కడినుంచి వచ్చింది? తమ సొంత డబ్బే పెట్టుబడి పెట్టారా? లేక ఇతర సొమ్మును లిక్కర్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టారా? అనే కోణంలో సీబీఐ విచారించనుందని ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే లిక్కర్ స్కాంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లులు శరత్ చంద్రపై ఆరోపణలు వచ్చాయి. ఇక భారతి కూడా లిక్కర్ స్కాంలో ఉన్నారనే ప్రచారాన్ని టీడీపీ తెరపైకి వచ్చింది. మాగుంట ఇళ్లు, కంపెనీల్లో ఈడీ సోదాలు నిర్వహించి కీలక ఆధారాలు సేకరించింది. కానీ తనకు ఢిల్లీ కుంభకోణంతో సంబంధం లేదని, తమ బంధువులు కొంతమంది ఢిల్లీలో మద్యం షాపులు నడిపిస్తున్నారని మాగుంట చెప్పుకొచ్చారు. తన బంధువుల పేర్లు ఉండటం వల్లే తన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారని తెలిపారు. తమ ఫ్యామిలీ ఎప్పటినుంచో లిక్కర్ బిజినెస్లో ఉందని, ఇతర రాష్ట్రాల్లో కూడా షాపులు ఉన్నాయన్నారు. ఇప్పుడు విశాఖకు చెందిన పలువురి నేతల ప్రమేయం కూడా ఇందులో ఉందనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే మూడు రాజధానులకు మద్దతుగా విశాఖ కేంద్రంగా పోరాటానికి సిద్దమైంది. టీడీపీ నేతలపై విమర్శల దాడిని పెంచింది. ఇలాంటి తరుణంలో విశాఖలో లిక్కర్ స్కాం ఎలాంటి ప్రకంపనలు రేపుతుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa