ఏలూరు ఆశ్రమ్ ఆసుపత్రి అనేక రకాలుగా ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్న తీరు అభినందనీయమని కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు పేర్కొన్నారు. భుజబలపట్నం ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ కొత్తపల్లి పెద్దిరాజు ఆధ్వర్యంలో గ్రామంలో ఆశ్రమ్ ఆసుపత్రి వారి సహకారంతో స్థానిక వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలోఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరం లో ఎమ్మెల్యే పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ అడవి కృష్ణ, , సర్పంచ్ గురజాల రామతులసి, ఎంపీటీసీ పెనుమత్స సూర్యనారాయణరాజు, కో అప్షన్ సభ్యులు సోమల శ్యాంసుందర్, వాసవి రవిరాజు, జంగం మోషే, ముప్పిడి శివ, పద్మనాధుని రాజా, తోట నాగరాజు, చక్రపాణి, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa