టీడీపీ కేంద్ర కార్యాలయ మీడియా కో ఆర్డినేటర్ దారపనేని నరేంద్ర అరెస్ట్ వ్యవహారం ఏపీలో రాజకీయంగా దుమారం రేగుతోంది. ఇదిలావుంటే ఏపీ సీఐడీ అధికారులపై టీడీపీ కేంద్ర కార్యాలయ మీడియా కో ఆర్డినేటర్ దారపనేని నరేంద్ర సీఐడీ కోర్టు న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. విచారణ పేరిట సీఐడీ అధికారులు తనను తీవ్రంగా కొట్టారని ఆయన తెలిపారు. అంతేకాకుండా తనకు జండూబామ్ రాసి మరీ తీవ్రంగా హింసించారని ఆయన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. నరేంద్ర చెప్పిన విషయాలను న్యాయమూర్తి రికార్డు చేశారు.
బుధవారం రాత్రి గుంటూరులోని తన నివాసంలో ఉన్న నరేంద్రను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. బుధవారం రాత్రి మొత్తం తమ అదుపులోనే ఉంచుకున్న నరేంద్రను గురువారం మధ్యాహ్నం వైద్య పరీక్షల కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం గురువారం రాత్రి ఆయనను సీఐడీ కోర్టు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగానే తనను సీఐడీ అధికారులు హింసించిన తీరుపై ఆయన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa