ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ వివాహేతర బంధం...ఓ నిండు ప్రాణాలను తీసేసింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 14, 2022, 09:34 PM

వదినతో మరిది పెట్టుకున్న సంబంధం బయటపడి హత్యకు దారితీసింది. గుండాలతండాకు చెందిన స్వామి నాయక్, మంగమ్మలకు కొన్నేళ్ల క్రిందటే వివాహమై ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు. భర్త స్వామినాయక్ వృత్తిరీత్యా డ్రైవర్ కావడంతో కారు నడుపుకుంటూ హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. అప్పుడప్పుడు ఇంటికి వెళ్లి భార్య, పిల్లలను కలిసి తిరిగి హైదరాబాద్ వస్తూ ఉంటాడు. వృత్తిరీత్యా ఎక్కువ రోజులు అతడు హైదరాబాద్‌లోనే ఉండాల్సి వచ్చేది.


స్వామి నాయక్‌కు వరసకు తమ్ముడు అయ్యే సుంకేనాయక్ ఇదే అదునుగా భావించి తన వదిన మంగమ్మపై కన్నేశాడు. స్వామి నాయక్ హైదరాబాద్‌లో ఉన్న సమయంలో తరుచూ వదిన ఇంటికి వెళ్లి వస్తుండేవాడు. ఇంటి పనుల్లో ఆమెకు సహాయం చేస్తుండేవాడు. వారిద్దరి మధ్య పరిచయం చివరికి వివాహేతర సంబంధానికి దారితీసింది. కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఒకరోజు పిల్లలు స్కూల్‌కి వెళ్లిన సమయంలో మంగమ్మ ఇంటికి సుంకే నాయక్ వచ్చాడు. ఇద్దరూ కలిసి బెడ్ రూంలో ఏకాంతంగా గడుపుతున్నారు. అయితే అదే సమయంలో భర్త స్వామినాయక్ సడెన్‌గా హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చాడు.


బెడ్ రూంలో ఇద్దరూ కలిసి ఉండటాన్ని చూసి ఆవేశానికి గురయ్యాడు. కోపంతో ఊగిపోతూ సుంకేనాయక్ పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. అడ్డుకునేందుకు ప్రయత్నం చేసిన భార్యపై కూడా కత్తితో దాడి చేశాడు. కత్తితో తీవ్రంగా దాడి చేయడంతో తమ్ముడు సుంకేనాయక్ అక్కడిక్కడే మరణించాడు. భార్య మంగమ్మకు గాయలవ్వగా.. ఆమెను స్థానికులు ఆప్పత్రికి తరలించారు. దాడి అనంతరం స్వామినాయక్ స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. అతడిని కోర్టులో హాజరుపర్చనున్నారు. ఈ హత్య స్థానికంగా కలకలం రేపుతోంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa