ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్ని చట్టాలు తెచ్చిన ఇంకా రెచ్చిపోతున్న లోన్ యాప్ నిర్వాహకులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 14, 2022, 09:35 PM

ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా లోన్ యాప్ నిర్వాహకుల తీరులో మాత్రం మార్పురావడంలేదు. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో లోన్ యాప్‌ వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. విజయవాడ సమీపంలోని ప్రసాదంపాడులో లోన్ యాప్ వేధింపులు తట్టుకోలేక లంకా మణికంఠ ప్రాణాలు తీసుకున్నాడు. అతడు ఉరివేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంతేకాదు ఇటీవలో మరో యువకుడు కూడా ఈ లోన్ యాప్ వేధింపులకు బలయ్యాడు.


తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్.లోన్‌ యాప్‌ల నుంచి రుణాలు తీసుకున్నాడు. ఆ లోన్‌లను చెల్లించినా.. ఇంకా కట్టాలంటూ లోన్‌ యాప్‌ నిర్వాహకుల వేధించారు. ఈ ఒత్తిడి భరించలేక ఫ్యాన్‌కి ప్రాణాలు తీసుకున్నాడు. ఆ ఘటన మర్చిపోకముందే మరో యువకుడు ప్రాణాలు తీసుకోవడం కలకలంరేపింది.


మరోవైపు రాష్ట్రంలో లోన్‌యాప్ వేధింపులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోన్‌ యాప్స్‌ అరాచకాలపై ఫిర్యాదు చేసేందుకు కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసింది. ఎవరికైనా వేధింపులు ఎదురైతే 1930 కాల్ సెంటర్ ఫోన్ చేసి బాధితులు ఫిర్యాదు చేయొచ్చని అధికారులు తెలిపారు. అంతేకాదు మొబైల్స్‌కు వచ్చే లోన్ యాప్ లింక్‌లు జోలికి వెళ్లొద్దని సూచించారు. అలాగే మొబైల్స్‌లో కాంటాక్ట్‌, అడ్రస్‌, లొకేషన్ల పర్మిషన్లు ఇవ్వొద్దని సూచనలు చేశారు. ఇలాంటి లోన్ యాప్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa