ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంటికి చేరుకొనే ఐదు నిమిషాల్లోపు...అలా వెళ్లిపోయారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 14, 2022, 09:37 PM

మరో ఐదు నిమిషాల్లో వారు ఇంటికి చేరుకుంటారనుకొనేలోపు వారిని మరణం  ఆహ్వానించింది. రోడ్డు ప్రమాదం వారిని వెంటాడింది. ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వల్లూరు సమీపంలో రైజ్ ఇంజినీరింగ్ కాలేజీ దగ్గర జాతీయ రహదారిపై ముందు వెళుతున్న లారీని వెనుకవైపు నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ఘటనా స్థలంలోనే కన్నుమూశారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో కారులోని ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయినా.. లారీని బలంగా ఢీ కొట్టడంతో ఎయిర్ బెలూన్స్ పేలిపోయాయి.


మృతులు ఒంగోలు మిరియాల పాలెం , దేవుని చెరువు, బీకే అపార్ట్ మెంట్‌కు చెందిన పవన్ కుమార్, శ్రీను, పరమేష్‌గా గుర్తించారు. చెన్నై వెళ్లి తిరిగి వస్తుండగా ఒంగోలు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. తెల్లవారుజాము కావడం, డ్రైవర్‌ కునుకుపాటుతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వీరు మరో ఐదు నిమిషాల్లో వారు ఇంటికి చేరుకుంటారు అన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి సమీపంలోనే వారి ఇళ్లు కూడా ఉన్నాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa