రాష్ట్ర ప్రభుత్వం తీరుపై టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. కారణం అమరావతి రైతుల పాదయాత్ర జరుగుతున్న వేళ ఏపీ ప్రభుత్వం తీసుకొన్న ఓ నిర్ణయమేనని చెప్పవచ్చు. ఈ నెల 17న పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో అడుగుపెట్టే ముందు రాజమండ్రి రైలు కం రోడ్ బ్రిడ్జి మూసివేయడం ఆసక్తికరంగా మారింది. అత్యవసర మరమ్మత్తుల నిమిత్తం వారం రోజులు పాటు మూసివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా కె . మాధవీలత ఆదేశాలు జారీ చేశారు. రహదారుల శాఖ, రైల్వే శాఖల ఆధ్వర్యలో జరగనున్న మరమ్మత్తు పనులు పనులు చేపట్టనున్నారు.
అయితే వాహనాలను నాలుగో వంతెన, ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ మీదుగా ట్రాఫిక్ మళ్లించనున్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆర్టీసి బస్సు లు, ధవళేశ్వరం బ్యారేజ్ మీదుగా వెళ్లాలని సూచించారు. లారీలు, ఇతర భారీ వాహానాలు 4 వ వంతెన మీదుగా మళ్లించారు. ఈనెల 17న రోడ్ కమ్ రైల్వే వంతెన మీదుగా అమరావతి రైతుల పాదయాత్ర జరగనున్న వేళ.. ఈ నిర్ణయం ఆసక్తికరంగా మారింది. అమరావతి రైతుల పాదయాత్ర ఎలా ముందుకు సాగాలన్నది క్లారిటీ రావాల్సి ఉంది.
అమరావతి రైతుల పాదయాత్ర ఉందనే కారణంతోనే ఇలా రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిని మూసివేశారని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. ‘కొంచం అయిన సిగ్గు ఉండాలి !. ఇన్నాళ్లు గుర్తుకు రాని రైల్వే బ్రిడ్జి మరమ్మతులు అమరావతి ప్రాంత రైతులు పాదయాత్ర వస్తుంది అని రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి మరమ్మత్తులు పేరు తో ఆపేస్తారా..? జగన్ గారు. మీరు పాదయాత్ర చేసినప్పుడు ఇలాగే వ్యవహరించి ఉంటే మీరు ఎమ్ చేసేవాళ్ళు?. శాడిస్టు ఆలోచనలు తప్పిస్తే మరొకటి లేదు’అంటూ ట్విట్టర్ వేదికగా ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరో ట్వీట్లో ‘ముందర ధవళేశ్వరం బ్రిడ్జి పరిస్థితి చూడండి వైఎస్ జగన్. పాడైపోయిన బ్రిడ్జి ని వదిలేసి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి ని ఆపేస్తున్నారు.. అమరావతి రైతులు పాదయాత్ర చూసి భయపడ్డావు రెడ్డి’అంటూ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పాదయాత్రను అడ్డుకునేందుకు ఇఈ నిర్ణయం తీసుకుందని ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. అమరావతి జేఏసీ ఛైర్మన్ జీవీఆర్ శాస్త్రి అమరావతి పరిరక్షణ సమితి తరపున ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. రైతులు చేపట్టిన అమరావతి టు అరసవల్లి మహా పాదయాత్రకు అడుగడునా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అమరావతి పరిరక్షణ సమితి సెప్టెంబర్ 12 పాదయాత్ర అనుమతి కోసం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. హైకోర్టు పాదయాత్రకు అభ్యర్థనను పరిశీలించాలని పోలీసులను ఆదేశించిందన్నారు. హైకోర్టు ద్వారా అనుమతి ఇచ్చినా సరే.. పాదయాత్రకు అడ్డంకులు ఎదురవుతున్నాయన్నారు. వెంటనే కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. వెంటనే దీనిపై హోం సెక్రటరీకి ఆదేశాలు ఇవ్వాలని.. రైతుల పాదయాత్రకు రక్షణ కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa