ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనకాపల్లి లో మంత్రి అమర్నాథ్ దిష్టిబొమ్మ దగ్ధం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 20, 2022, 02:58 PM

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై విమర్శలను నిరసిస్తూ అనకాపల్లి పట్టణంలో జనసైనికుల ఆధ్వర్యంలో మంత్రి అమర్నాథ్ దిష్టిబొమ్మ దగ్ధం జరిగింది. బుధవారం రాత్రి స్థానిక నెహ్రూ చౌక్ జంక్షన్ వద్ద జరిగిన ఈ ఆందోళనలో పార్టీ సీనియర్ నాయకులు శ్రీరామదాసు గోవింద్, తాడిరామకృష్ణ, మల్లశ్రీను, దూల౦ గోపీ లు మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలు పై చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పలేక వ్యక్తి గత దూషనలు చేస్తున్నమంత్రి అమర్నాథ్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అమర్ నాథ్ కు దమ్ముంటే అనకాపల్లిఅభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమం లో జనసైనికులు. పాల్గొన్నారు. పీజే. హరీష్, గొల్లవిల్లి. రాజు , పెద్దాడ. సాయి తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa