ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీసీల సొంత ఇల్లు తెలుగుదేశం పార్టీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 20, 2022, 03:36 PM

బీసీ సాధికార కమిటీ కన్వీనర్లతో నారా లోకేష్   సమావేశం అయ్యారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, బీసీ సెల్ అధ్యక్షుడు కొల్లు రవీంద్ర, టిడిపి నేతలు దువ్వారపు రామారావు, రామాంజనేయులు, టిడి జనార్ధన్, 54 సాధికార కమిటీ కన్వీనర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ...  జగన్ పాలనలో బీసీలకు జరుగుతున్న అన్యాయం, ఉద్యమ కార్యాచరణ పై చర్చించాం. సాధికార కమిటీల ఏర్పాటు, బలోపేతం పై సమాలోచనలు చేశాం. బీసీల్లో ఉన్న అన్ని కులాలకు ప్రాతినిధ్యం, కులాల వారీగా సమస్యల అధ్యయనం పై ప్రణాళిక సిద్ధం చేశాం. బీసీల సొంత ఇల్లు తెలుగుదేశం పార్టీ. 34% రిజర్వేషన్లు 26 ఏళ్ల పాటు అమల్లో ఉండానికి కారణం టిడిపి. బీసీ రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గడానికి కారణం జగన్ రెడ్డి. బీసీలంటే బ్యాక్ బోన్ క్లాస్ అంటూ బిల్డప్ ఇచ్చిన జగన్ రెడ్డి బీసీల బ్యాక్ బోన్ విరిచేసాడు. నిధులు ఉన్న వెయ్యి ముఖ్య పదవులు తన బంధువులకు, తన సామాజిక వర్గానికి ఇచ్చుకొని నిధులు లేని 56  కార్పొరేషన్లు  బీసీలకు ఇచ్చాడు జగన్ రెడ్డి అని తెలియజేసారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa