ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యాసిడ్ తాగి వ్యక్తి మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 21, 2022, 03:25 PM

అప్పులు బాధలు తాళలేక ఓ వ్యక్తి యాసిడ్ తాగి మృతి చెందిన సంఘటన శృంగవరపుకోట పట్టణంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ తారకేశ్వరరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. శృంగవరపుకోట పట్టణం స్థానిక వన్వే ట్రాఫిక్ సమీపంలో నివాసముంటున్న కుసుమంచి రామకృష్ణ (48) అనే వ్యక్తి తన కుటుంబంతో కలసి కిరాణా షాపును నిర్వహిస్తూ నివాసం ఉంటున్నాడు. ఇదిలా ఉంటే రామకృష్ణ ఇటీవల అప్పులు చేశాడు. అప్పులు బాధలు తాళలేక రామకృష్ణ గురువారం తన ఇంటి బాత్రూంలో గల బాత్రూం క్లీనర్ యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.


గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన రామకృష్ణను వైద్య చికిత్స నిమిత్తం శృంగవరపుకోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్య చికిత్స కోసం వైద్యుల సూచనలు మేరకు రామకృష్ణను విజయనగరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో రామకృష్ణ వైద్యం పొందుతూ గురువారం సాయంత్రం మరణించాడు. మృతుడి భార్య సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు శృంగవరపుకోట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa