ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిలియన్ జనాభాకు ప్రతినిధి పీవీ!.. సిడ్నీలో విగ్రహావిష్కరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 23, 2022, 03:59 PM

విదేశాల్లో మహాత్మాగాంధీ తరువాత రెండో విగ్రహం పీవీదే.  విదేశాల్లో ఆవిష్కరించిన మొట్టమొదటి భారత ప్రధాని విగ్రహం. ఒక బిలియన్ కు పైగా జనాభా ఉన్న దేశానికి ప్రధానిగా నేతృత్వం వహించిన పీవీ నరసింహారావు విగ్రహాన్ని విదేశాలలో మొదటి సారిగా సిడ్నీ స్ట్రాత్ ఫీల్డ్ లో ఆవిష్కరించడం.. చాలా గర్వంగా ఉందని పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ సభ్యుడు, ఓవర్సీస్ కమిటీ కన్వీనర్ మహేష్ బిగాల పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం స్ట్రాత్ ఫీల్డ్ హోంబుష్ కమ్యూనిటీ సెంటర్లో స్వర్గీయ పీవీ నరసింహారావు విగ్రహాన్ని స్ట్రాత్ ఫీల్డ్ మేయర్ మాథ్యూ బ్లాక్ మోర్, కౌన్సిలర్ సంధ్యారెడ్డి, పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ వాణీదేవి, పీవీ కుటుంబ సభ్యుల సమక్షంలో ఆవిష్కరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa