ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీ కార్యాలయానికి కూతవేటు దూరంలో 'మహిళా కమిషన్' వుంది: వాసిరెడ్డి పద్మ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 23, 2022, 08:43 PM

మీ  జనసేన పార్టీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే 'మహిళా కమిషన్' ఉందని జనసేన నేతలకు ఆ కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కౌంటర్ ఇచ్చారు.  ఇదిలావుంటే  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన మూడు పెళ్లిళ్ల వ్యాఖ్యలపై దుమారం కంటిన్యూ అవుతున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని పవన్ కళ్యాణ్‌కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. అయితే.. మహిళా కమిషన్‌ టార్గెట్‌గా జనసేన ట్వీట్ల వర్షం కురిపించింది. ఏపీలో అత్యాచారాలు జరుతుంటే.. వైసీపీ నేతలు బూతులు తిడుతుంటే.. ఓ ఎంపీ వీడియో కాల్‌లో అడ్డంగా దొరికినప్పుడు మహిళా కమిషన్ ఎక్కడికి వెళ్లిందని ప్రశ్నించింది. 18 అంశాలకు సంబంధించి వరుసగా ట్వీట్లు జనసేన పార్టీ చేసింది.


జనసేన చేసిన ట్వీట్లపై మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. 'ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. మహిళా కమిషన్ ఎక్కడ అనే సందేహమెందుకు? జనసేన పార్టీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే 'మహిళా కమిషన్' ఉంది. మీ పార్టీ అధినేత ఇప్పటికైనా కళ్లుతెరిచి 'మహిళ'కు క్షమాపణ చెబితే.. ప్రజాస్వామ్య వ్యవస్థల్ని గౌరవించినట్లే'. వాసిరెడ్డి పద్మ ట్వీట్ చేశారు. పవన్‌కు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. వాసిరెడ్డి పద్మ చేసిన ట్వీట్ ఇప్పుడు ఏపీ లో హాట్ టాపిక్‌గా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa