ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 94వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలను అందించవచ్చు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నెంబర్ కు ఈ నెల 28 వతేది వరకు పంపవచ్చు. అలాగే http://mygov.in వెబ్ సైట్ ద్వారా కానీ.. 1922 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా.. తిరిగి మన మొబైల్ కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa